AMARAVATHI

అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,,భారతదేశం మధ్య ప్రగాఢమైన స్నేహం కారణంగా,,ఇక్కడికి వచ్చిన తనకు స్వంత ప్రాంతంలో వున్న అనుభూతి కలుగుతొందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు.. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో నిర్మించిన ఈ ఆలయాన్ని బోచసన్వాసి శ్రీఅక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ హిందూ దేవాలయంగా పిలుస్తున్నారు..దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ పనులు 2019 సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యాయి.. ఆలయ నిర్మాణం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.. ఈ ఆలయం మార్చి 1 నుంచి ప్రజల కోసం తెరవబడుతుంది..ఈ ఆలయ ప్రాకారంలో సందర్శకుల కేంద్రం,, ప్రార్థనా మందిరాలు,,ప్రదర్శనలు,, అభ్యాస ప్రాంతాలు,, క్రీడా ప్రాంతాలు ఏర్పాటు చేశారు..పిల్లలు, యువత కోసం ఫుడ్ కోర్టులు,, గిఫ్ట్ షాప్స్ తో సహా అనేక ఇతర సౌకర్యాలు అందుబాటు ఉన్నాయి.. అబుదాబిలో నిర్మించిన ఈ ఆలయాన్ని దాదాపు రూ.700 కోట్లతో BAPS సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు.. BAPS అనేది ప్రపంచవ్యాప్తంగా 1,100 కంటే ఎక్కువ హిందూ దేవాలయాలను నిర్మించిన సంస్థగా ప్రసిద్ధి గాంచింది..ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ కారిడార్ కంటే చాలా విశాలమైంది..ఈ ఆలయం నిర్మాణంలో భాగంగా రాజస్థాన్‌ జైపూర్‌లోని గులాబీ ఇసుక రాళ్లను ఉపయోగించారు..ఆలయ మధ్య భాగంలో స్వామి నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..అయోధ్యలో ఆలయాన్ని నిర్మాణంకు ఉపయోగించింది కూడా ఇదే రాయి కావడం గమనర్హం..పాలరాతితో చేసిన ఆలయంలోని ప్రతి స్తంభంపై హనుమాన్,,రామ్,సీతా, గణేష్ విగ్రహాలు చెక్కబడ్డాయి. ఆలయ వెలుపల వైపు స్తంభాలపై సీతా స్వయంవరం,,రామ వనగమన్,, కృష్ణ లీలలు మొదలైనవి ఉన్నాయి.. భారతదేశం, యూఏఈ సంస్కృతుల సంగమం నేపథ్యంలో ఆలయంలో 7 మినార్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడం, భూకంపం వంటి విపత్తులను పసికట్టేందుకు 300 హైటెక్ సెన్సార్లను అమర్చారు..ఆలయ నిర్మాణంలో ఎటువంటి మెటల్ ఉపయోగించబడలేదు..

 

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 hour ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

4 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

5 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.