నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పు చేర్పుల వివరాలను నేటి నుంచి డిసెంబర్ నెల 8వ తేదీ వరకు చేపట్టనున్నామని కమిషనర్ శ్రీమతి హరిత తెలియజేసారు. స్థానిక E.S.R.M పాటశాలలో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి డ్రాఫ్ట్ ఎలెక్టోరల్ రోల్ పబ్లికేషన్ ను విడుదల చెసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదుపై ప్రజలంతా అవగాహన పెంచుకుని ఓటరు నమోదుకు ప్రోత్సహించాలని కోరారు. అనంతరం నూతనంగా రూపొందించిన ఓటరు లిస్టును ప్రజలకు చదివి వినిపించారు. నూతన ఓటరు లిస్టును అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిర్మలానంద బాబా, డిప్యూటీ తహశీల్దార్ శైలజా కుమారి, బి.ఎల్.ఓ సూపర్వైజర్ కృష్ణ కిషోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.