నెల్లూరు: నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు పెండింగులో ఉన్న కోర్టు కేసుల ప్రస్తుత పరిస్థితిని మరియు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంభందించిన కోర్టు కేసులు పరిష్కారానికి అవసరమైన అన్ని దస్త్రాలను సకాలంలో సిద్ధంచేసి, త్వరగా కేసులు పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకొనవలెనని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని సూచించారు. కార్పొరేషన్ సూచించిన నిబంధనల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అదే విధంగా రోడ్డును ఆక్రమిస్తూ నిర్మించిన షాపులు, దుకాణాలను గుర్తించి వాటి యజమానులకు ఆక్రమణ పన్నులు విధించి వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
This website uses cookies.