DEVOTIONAL

శ్రీవారి వైభవోత్సవాలు ప్రజలకు మరింత చేరువు చేస్తాయి-కలెక్టర్

నెల్లూరు: కలియుగంలో భగవంతున్ని ప్రజలకు మరింత చేరువుగా తీసుకుపోయేందుకు వైభవోత్సవ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.గురువారం నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం-విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర  వైభవొత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతి సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి మొదలై చాలా ఘనంగా జరుగుతున్నాయన్నారు.  ఈ ఉత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు సాంప్రదాయ బద్ధంగా తిరుమలలో శ్రీవారికి ఏవిధంగా సేవలు అందుతాయి ఇక్కడ కూడా అలాంటి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతినిత్యం సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఎంతో చక్కగా జరుగుతున్నాయన్నారు.సాక్షాత్తు భగవంతుడే భక్తుల చెంతకు వచ్చినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు కావలసిన మంచినీరు, మరుగుదొడ్లు, క్యూ లైన్లు తదితర ఏర్పాట్లు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సజావుగా చేయడం జరిగిందన్నారు. వివిధ సేవలకు సంబంధించి ప్రవేశ,నిష్క్రమణ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ నుంచి 400 మంది సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఉత్సవాలన్నీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఉత్సవాలు నగరంలో ఏడు సంవత్సరాల తర్వాత మరల జరుపుకోవడం, పెద్ద సంఖ్యలో భక్తులు రావడం చాలా ఆనందాన్ని ఇస్తున్నాయన్నారు. సజావుగా జరిపేందుకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

5 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

This website uses cookies.