NATIONAL

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన ఈసీ

అమరావతి: ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12వ తేది,, మేఘాలయ అసెంబ్లీ, మార్చి 15వ తేది,, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22వ తేదితోనూ ముగియనున్నాయి..బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు.. నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు వంతున ఉన్నాయి..త్రిపురలో ఫిబ్రవరి 16వ తేదిన ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు..మేఘాలయలో ఫిబ్రవరి 27వ తేదిన పోలింగ్ జరుగుతుందని,,నాగాలాండ్‌లో కూడా ఫిబ్రవరి 27వ తేదినే పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు..ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదిన వెలువడతాయని తెలిపారు..ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ (cVigil app) ద్వారా ఎన్నికల కమిషన్‌ (ECI)కి తెలియజేయవచ్చునని,, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామన్నారు..ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

4 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

7 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

8 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

8 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.