అమరావతి: ఉద్యోగల రీత్యా,,జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు,తమ సొంత నియోజక వర్గాల్లో ఓటింగ్ లో పాల్గొన్నడం లేదన్న విషయం ఎన్నికల కమీషన్ గుర్తించింది..2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది..అప్పట్లో దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలింది..వీరంతా బయటి ప్రాంతాల్లో స్థిరపడ్డ వారే అని, వీరు ఓటింగ్ లో పాల్గొనేలా ఎన్నికల కమీషన్ రిమోట్ ఓటింగ్ మెషిన్ ను అభివృద్ధి చేసింది..ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లకుండానే ఓటు వేసేలా ప్లాన్ చేస్తోంది..జనవరి 16వ తేదిన రాజకీయ పార్టీలకు “డెమో” ఇచ్చేందుకు ఈసీ సిద్ధమైంది..ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిమోట్ వోటింగ్ మిషన్ డెమోకు హాజరుకావాలని ఆహ్వానం పంపింది. లీగల్,,అడ్మినిస్ట్రేటివ్,, టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ అమలుపై ముందుకెళ్లాలని ఈసీ భావిస్తోంది..ఈ కొత్త ఓటింగ్ మిషన్ తో ఒక పోలింగ్ బూత్ నుంచి 72 వేర్వేరు నియోజకవర్గాలను కవర్ చేసేలా రూపొందించారు. రాజకీయ పార్టీల అంగీకారం తర్వాత ఈ ఇష్యూపై ఈసీ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని సమాచారం..మరి రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం వెల్లడిస్తాయో వేచి చూడాలి..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.