HEALTH

కోవిడ్ దశ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదు-కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

అమరావతి: కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో వుంచుకుని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ నిపుణులు,అధికారులతో బుధవారం పరిస్థితిని సమీక్షించారు.కోవిడ్ దశ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదని,ఆప్రమత్తంగా వుంటూ నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. భారతదేశంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నట్లు తెలిపారు.చైనా,అమెరికా తదితర దేశాల్లో వారానికి దాదాపు 35 లక్షల కేసులు వరకు నమోదు అవుతున్నయన్నారు..కొన్ని ముందస్తూ జగ్రత్తలు తీసుకొవడం ద్వారా కొత్త వేరియంట్ లను గుర్తించి,ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

జూన్ లోనే కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది.వైరస్ కొత్త వేరియంట్ లను ఎప్పటికప్పడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర అరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు.కొవిడ్ పాజిటివ్ గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం పరీక్షా కేంద్రాలకు పంపించాలని కోరారు.దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 4 వేలకు దిగువనే వున్నాయి.

భారతీయులు ఆందోళనచెందవలసిన:- చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపధ్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళనచెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు..చైనా, ఇటలీలలో పరిణామాలను గుర్తించి, తక్కువగా సిద్ధమవడం కన్నా మితిమీరిన సన్నద్ధత మంచిదని తాము గతంలో భావించామని, దానివల్ల మేలు జరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలు, క్లినిషియన్స్, విధాన రూపకర్తల మధ్య సమన్వయం ఉండటం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

8 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

9 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

14 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.