అమరావతి: జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది..జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.. జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది..జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న తర్వాత సంజయ్ కిషన్ కౌల్,,ఎఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం తీర్పును డిసెంబర్ 1న రిజర్వ్ చేసింది..డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం లేదని పిటీషనర్లు వాదించారు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం డీలిమిటేషన్ను 2026 తర్వాత మాత్రమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ జమ్మూ-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి దీని నుండి ప్రత్యేకించబడిందని కోర్టుకు కేంద్రం తెలిపింది..2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370)ను రద్దు చేసిన తర్వాత రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ-కాశ్మీర్ ఏర్పాటు అయ్యాయి..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.