DISTRICTS

పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ ఆదేశాలతో చేపట్టిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ ప్రకటించారు. కార్యాలయంలో గురువారం నిర్వహించిన సచివాలయాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని నెల్లూరు నగర పాలక సంస్థ, పురసంఘాలు, నగర పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయాల కార్యదర్శుల ఆన్లైన్ అభ్యర్ధనల మేరకు బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు నిర్దేశించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ ను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. 2019/2020 వార్డు సచివాలయాల సెక్రెటరీల నియామకం, ర్యాంకు, మార్కుల ప్రాధాన్యత మేరకు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, ఇతర పురపాలక సంఘాల కమిషనర్ లు, నగర పంచాయతీలను సమన్వయం చేసుకుని వార్డు సచివాలయాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కమిషనర్ కోరారు. బదిలీల ప్రక్రియలో కావలి, గూడూరు, నాయుడు పేట, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట కమిషనర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

7 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

10 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

10 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.