DEVOTIONAL

గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే-గరికపాటి నరసింహారావు

నెల్లూరు: దేశ ప్రజల శాంతి, సుఖ,  సంతోషాల కోసమై సాంస్కృతిక శాఖ ద్వారా దేశంలోని వివిధ దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.కార్తీక పౌర్ణమి సందర్బంగా సోమవారం సాయంత్రం నగరంలోని గణేష్ ఘాట్ లో కార్తీక దీపోత్సవ సమితి నేతృత్వంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సయోధ్యగా కలిసిమెలిసి ఉండడానికి అత్యంత అనువైన మార్గం ఆధ్యాత్మిక భావనయే నన్నారు.ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసమని, సంస్కృతి, సంస్కారం, సందేశం ఇమిడి ఉండే దీపం అర్ధాన్ని వివరించారు. ఉపవాస దీక్ష వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తూ ఆధ్యాత్మికo, ఆరోగ్యo మేళవించి చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ గ్రామ దేవతలతో మనకు బంధుత్వం ఉంటుందని,  అటువంటి గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనన్నారు. హిందూ సాంప్రదాయం వైజ్ఞానిక సాంప్రదాయమన్నారు. తొలుత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద, ప్రవచనకర్త పద్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు ల సమక్షంలో స్వర్నాల చెరువులో గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రతేకంగా ఏర్పాటు చేసిన పడవలలో దాదాపు వంద మంది మత్స్యకారులు తో స్వర్నాల చెరువు కార్తీక దీపాలతో తళుకుళీనింది.  శివ నామ స్మరణ తో  గణేష్ ఘాట్ పరిసరాలు మార్మోగాయి.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

12 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

20 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.