ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని 93 లోక్సభ స్థానాల్లో…ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఈసీ కల్పించింది..3వ దశలో 120 మంది మహిళలు సహా 13 వందలకు పైగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది..కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ బరిలోకి దిగారు.. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్, దిగ్విజయ్సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు..3వ దశ ముగియడంతో, మొత్తం 543 లోక్సభ స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంది..4వ దశ మే 13న, 5వ దశ మే 20న, 6వ దశ మే 25న, 7వ దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు.. జూన్ 4వ తేదిన కేంద్ర ఎన్నికల సంఘం అన్ని లోక్సభ స్థానాల ఫలితాలను వెలడించనుంది.
#WATCH | Nadiad, Gujarat: Ankit Soni, a voter, casts his vote through his feet at a polling booth in Nadiad
He says, "I lost both my hands due to electric shock 20 years ago. With the blessings of my teachers and guru, I did my graduation, CS… I appeal to people to come out… pic.twitter.com/UPx8G5MTPz
— ANI (@ANI) May 7, 2024