తిరుపతి: ఏపీ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(C) మేరకు పేద విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలల్లో 1 వ తరగతిలో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన పేద కుంటుంబాల విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో, 2023-24 విద్యా సంవత్సరం 1వ తరగతిలో అడ్మిషన్ కొరకు ఏప్రిల్ 1వ తేదీ నాటికి 5 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన పిల్లల వివరాలతో ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో 423 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 4230 మందికి అవకాశం వుందన్నారు..విద్యా హక్కు చట్టం-2009,AP RTE 2023, సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 25% సీట్లు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పేద కుటుంబాలకు కేటాయింపు కొరకు నిబంధనలు పొందుపరచడం జరిగిందన్నారు.. http://cse.ap.gov in/RTE వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు..సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు, దారిద్ర్యరేఖకు దిగువున వున్నవారు, భూమిలేని వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ఎస్.సి, ఎస్టీలు అర్హులని, గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉచిత దరఖాస్తు సదుపాయం కల్పించబడిందని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.