పదవికి రాజీనామా చేసిన ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్
అమరావతి: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు..తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా,, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు..ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. కేంద్ర ఎన్నికల కమిషన్లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలి ఉన్నారు.. మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..గోయల్ రిటైర్డ్ బ్యూరోక్రాట్, పంజాబ్ కేడర్కు చెందిన ఈయన 1985-బ్యాచ్ IAS అధికారి..నవంబర్ 2022లో ఎన్నికల సంఘంలో చేరారు..దిని వెనుక కారణలు ఏమిటనేది త్వరలో తెలియనున్నది.