నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఓటర్లంతా తమ హక్కును సద్వినియోగ పర్చుకోవాలని A.E.R.O.సిటీ ప్లానర్ దేవీకుమారీ కోరారు. ఓటరు నమోదు అవగాహన కోసం 10 ప్రచార వాహనాలు, బైక్ ర్యాలీ ద్వారా మంగళవారం వి.ఆర్ కళాశాల మైదానం నుంచి ఏ.ఈ.ఆర్.ఓ జెండా ఊపి ప్రారంభించారు.గాంధీ బొమ్మ, కనకమహల్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్, సుబేదార్ పేట రోడ్డు, సంత పేట, పాత మున్సిపల్ ఆఫీసు రోడ్డు, ఇరుగాళమ్మ దేవస్థానం కూడలి, డి.కె. మహిళా కళాశాల, బారా షహీద్ దర్గా, నగర పాలక సంస్థల మీదుగా సాగిన ఈ బైక్ ర్యాలీలో నగర పాలక సంస్థ సిబ్బంది, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ-117 ఓటరు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ప్రచార వాహనాలతో ఓటరు నమోదుపై చైతన్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 70 ప్రచార వాహనాలతో పాటు ఓటరు అవగాహనా క్యాంపులను నగర వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ప్లానింగ్ సిబ్బంది,సూపర్ వైజర్లు, బి.ఎల్.ఓ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.