AMARAVATHIDISTRICTS

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోండి- ఈ.ఆర్.ఓ.దేవీ కుమారీ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఓటర్లంతా తమ హక్కును సద్వినియోగ పర్చుకోవాలని A.E.R.O.సిటీ ప్లానర్ దేవీకుమారీ కోరారు. ఓటరు నమోదు అవగాహన కోసం 10 ప్రచార వాహనాలు, బైక్ ర్యాలీ ద్వారా మంగళవారం వి.ఆర్ కళాశాల మైదానం నుంచి ఏ.ఈ.ఆర్.ఓ జెండా ఊపి ప్రారంభించారు.గాంధీ బొమ్మ, కనకమహల్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్, సుబేదార్ పేట రోడ్డు, సంత పేట, పాత మున్సిపల్ ఆఫీసు రోడ్డు, ఇరుగాళమ్మ దేవస్థానం కూడలి, డి.కె. మహిళా కళాశాల, బారా షహీద్ దర్గా, నగర పాలక సంస్థల మీదుగా సాగిన ఈ బైక్ ర్యాలీలో నగర పాలక సంస్థ సిబ్బంది, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ-117 ఓటరు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ప్రచార వాహనాలతో ఓటరు నమోదుపై చైతన్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 70 ప్రచార వాహనాలతో పాటు ఓటరు అవగాహనా క్యాంపులను నగర వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ప్లానింగ్ సిబ్బంది,సూపర్ వైజర్లు, బి.ఎల్.ఓ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *