నెల్లూరు: వీధికుక్కల కాటునుంచి ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి కుక్కలకు యాంటి రాబిస్ టీకాలు అందిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ వెల్లడించారు. స్థానిక బాలాజీ నగర్ కాంతమ్మ ఆశ్రమం సమీపంలోని సచివాలయం వద్ద వీధికుక్కలకు రాబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని కమిషనర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల సమస్యలపై 9553219996 నెంబరుకు సమాచారం అందించాలని సూచించారు. టీకాలు వేసిన అనంతరం ఆయా కుక్కలను స్థానిక ప్రదేశంలోనే వదిలేస్తారని, దుందుడుకు స్వభావం ఉన్న కుక్కలను టీకాల తర్వాత కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారని కమిషనర్ తెలిపారు. డివిజన్లలోని స్థానిక కార్పొరేటర్ల సహకారంతోనే వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సుజాత, శ్రీకాంత్ రెడ్డి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.