రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్ధించా-సీ.ఎం రేవంత్ రెడ్డి
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..కుటుంబసభ్యులతో కలిసి రేవంత్రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.. తమ మొక్కులు చెల్లించుకున్నారు.. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేయగా,, టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు..తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారన్నారు..ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాని వెల్లడించారు..అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందన్నారు..సకాలంలో వర్షాలు కురిసి,, కరువు పరిస్థితులు తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు..తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమలలో ప్రభుత్వం తరపున సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.