AMARAVATHIDISTRICTS

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది..
నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సూచించారు. సోమవారం అయన ఎన్నికల కమాండ్ కంట్రోల్ సెంటర్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, కేంద్ర పరిశీలకులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిశ్రా మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగిస్తూ ఎన్నికల నిర్వహణ చేస్తున్నందుకు జిల్లా యంత్రంగాన్ని ఆయన అభినందించారు. సీజింగ్ ల్లో పట్టుబడిన నగదు వస్తువుల విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పోలీస్ బలగాల సరిపోతాయా ఇంకా అవసరం ఉందా ఎస్పీ ని కోరగా ఇతర రాష్ట్రాల నుండి పోలీసు బలగాలను తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
కమాండ్ కంట్రోల్ చేరుకున్న ప్రత్యేక అబ్జర్వర్ ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి కంప్లైంట్ సెల్ ,సోషల్ మీడియా ,సి విజిల్ వాహనాల జిపిఎస్, చెక్ పోస్ట్ లో తనిఖీలు తదితర అంశాలను కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరి నారాయణన్‌ ఎన్నికల ప్రత్యేక జనరల్ పరిశీలకులకు వివరించారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది:- నేటితో నామినేషన్లు వేసిన కొంత మంది అభ్యర్దులు విత్ డ్రా చేసుకున్నారు.నెల్లూరు సీటి నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది అభ్యర్దులు నామినేషన్ దాఖలు చేయగా అందులో 8 మందికి సంబంధించి నామినేషన్లు రిజెక్ట్ అయ్యయి..మరో 3 అభ్యర్దులు విత్ డ్రా చేసుకున్నారు..బరిలో ఇండిపెండెట్స్ తో కలుపుకుని 15 మంది అభ్యర్దులు రంగంలో వున్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *