AMARAVATHI

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 10 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు..ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. శ్రీనగర్ లో భారీ ప్రకంపనలు వచ్చాయని,,అలాగే జమ్మూలోని దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు..జమ్మూ,,ఢిల్లీ-NCR, హిమాచల్ ప్రదేశ్ పలుచోట్ల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది..దోడాలోని గందోభలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో,,భూమి ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు NCS తెలిపింది..భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు..భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

17 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

18 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

19 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

21 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

22 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.