హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది..విచారణ కోసం కవిత గురువారం ఢిల్లీ రావాలని నోటీసులో పేర్కొంది..సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లైని మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈడీ అరెస్టు చేసింది..ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై తాను కవితకు బినామీనని ఒప్పుకున్నాడని,,సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చేరాయని ఈడీ వెల్లడించింది..పిళ్లైను విచారించిన సమయంలో, కవిత, పిళ్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది.. పిళ్లై, కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని ఈడీ విచారణలో తేల్చింది..దింతో రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది..ఈ విషయంపై గురువారం విచారణకు రావాలని కవితను ఈడీ కోరింది.. కవితతో పాటు మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది..బుచ్చిబాబును విచారిస్తే అతను ఇచ్చే స్టేట్మెంట్ లో కీలక ఆధారాలు బయటపడతాయని ఈడీ భావిస్తొంది..లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి,,అభిషేక్ లకు పిళ్లైతో ఉన్న సంబందాలపై ఆరా తీయనుంది..ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు..రామచంద్ర పిళ్లై ఈ నెల 13వ తేది వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నాడు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.