అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్దిక మంత్రి బుగ్గన..
అమరావతి: 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86, 389 కోట్లతో అసెంబ్లీలో ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంగా పేర్కొన్నారు.. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు తెలిపారు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు, జీఎస్డీపీలో రెవెన్యూలోటు 1.56 శాతమని ఆర్థిక మంత్రి వెల్లడించారు.. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టే సమయంలో మహాత్మాగాంధీ సందేశంతో మొదలుపెట్టారు.. 5 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు..
పెన్షన్ కానుక ద్వారా 84 వేల కోట్లను అందించాం…ఐదేళ్లలో ప్రజాపంపిణీలో ఇంటి ముందుకే సరుకులను పంపేలా సంచార పంపిణీ వాహనాలు ప్రవేశపెట్టాం…దిని ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కూడా దొరికింది..5 ఏళ్లుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశాం…2019 వరకూ రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా వైసీపీ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను నిర్మించింది…పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది…ప్రాధాన్యాతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం..
ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం…2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలను స్థాపించాం…తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్ గా తయారైంది…10,778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశాం…రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది…వైద్యారోగ్య రంగంలో ‘నాడు నేడు’ పథకం అమలు చేశాం…ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ రూ.16,852 కోట్లు వ్యయం చేశాం…53.58 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్ల మేర రైతు భరోసా ఆర్థిక సాయం అందించామన్నారు..
1.35 లక్ష మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశామన్నారు..2.5 లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకూ పాలన అందుతుందన్నారు..ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్ లను పంపిణీ, 34.30లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచామన్నారు. వెయ్యి స్కూళ్లలో సీబీఎస్ఐ సిలబస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్, వైస్సార్ లాంటి దర్శానికుల ఆలోచనతో ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర ష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామన్నారు.