AMARAVATHI

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తాం-కమిషనర్ వికాస్

నెల్లూరు: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. స్థానిక  పొదలకూరు రోడ్, క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 34/1,34/2 సచివాలయాల్లో శానిటేషన్ మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో ఇన్స్పెక్షన్ రిజిస్టర్ తో పాటు స్పందన రిజిస్టర్ ను సరిగా మైంటైన్ చేయాలని సూచించారు. వసూలు చేసిన పన్నులను సకాలంలో డిపాజిట్ చేయాలని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సచివాలయ ప్రాంగణంలో ప్రదర్శించాలని కమిషనర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించి కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేసారు. స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి మంచినీరు సరఫరా అగు జంక్షన్ సమీపంలో రోడ్డు గుంతలమయంగా ఉన్నట్లు గమనించిన కమిషనర్ వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ఉన్న భవన నిర్మాణ సామగ్రిని తొలగించేందుకు భవన యజమానులకు నోటీసులు జారి చేయాలని సూచించారు. అదేవిధంగా సచివాలయం పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారి చేయాలని కమిషనర్ ఆదేశించారు. యజమానులు వారి ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకుని దోమల నిర్మూలనకు, ప్రహరీ గోడలు నిర్మించుకుని ఆక్రమణలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని సానిటరీ సిబ్బంది మరియు కార్యదర్శులను  కమిషనర్ ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

2 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

10 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

1 day ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

This website uses cookies.