AMARAVATHI

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు,కొండచరియలు విరిగి పడి 21 మంది మృతి

అమరావతి: నైరుతి రుతుపవనాల జూన్ 24వ తేదీన ఉత్తరాది రాష్ట్రాలోకి ప్రవేశించి అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి..హిమాచల్ ప్రదేశ్ లో గత 48 గంటలుగా విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బియాస్ నది నీటిమట్టం పెరిగింది..భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదల్లో 12 మంది మరణించగా,, సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడడంతో మట్టి క్రింద కూరుకుని పోయి 9 మంది మృతి చెందారు..దింతో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుక్కు వెల్లడించారు..“క్లౌడ్ బరస్ట్” వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి.. పలు రహదారులతో పాటు కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి..వాతావరణ శాఖ,, ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది..SDRF, NDRF,ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది..అయితే వర్షం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని,,వీలైనంత వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే వుండాని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

6 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

9 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

9 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.