AMARAVATHINATIONAL

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు,కొండచరియలు విరిగి పడి 21 మంది మృతి

అమరావతి: నైరుతి రుతుపవనాల జూన్ 24వ తేదీన ఉత్తరాది రాష్ట్రాలోకి ప్రవేశించి అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి..హిమాచల్ ప్రదేశ్ లో గత 48 గంటలుగా విడవకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బియాస్ నది నీటిమట్టం పెరిగింది..భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదల్లో 12 మంది మరణించగా,, సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడడంతో మట్టి క్రింద కూరుకుని పోయి 9 మంది మృతి చెందారు..దింతో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 21 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి సుఖవీందర్ సింగ్ సుక్కు వెల్లడించారు..“క్లౌడ్ బరస్ట్” వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి.. పలు రహదారులతో పాటు కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి..వాతావరణ శాఖ,, ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది..SDRF, NDRF,ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది..అయితే వర్షం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని,,వీలైనంత వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే వుండాని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *