AMARAVATHIPOLITICS

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై నడుస్తున్న హై డ్రామా?

అమరావతి: మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం,ఏ.పి సీఈవోకు నోటీసులు పంపించింది..ఈవీఎం ధ్వంసం ఘటనపైనా సీఈవోను వివరణ కోరింది. ఈవీఎం ధ్వంసంకు పాల్పడింది ఎమ్మెల్యేనేనా అని ప్రశ్నించింది… ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిచింది.. కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది..బుధవారం సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి… ఈవీఎంను ధ్వంసం చేశాడు..ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం వైరల్ అయింది.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ, ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వెళ్లారు.. సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు..అయితే పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి). ఆర్ పి యాక్ట్ 131, 135 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.. ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 కింద రెండు నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది.. దీంతో పిన్నెల్లి ఎన్నికల్లో గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *