AMARAVATHIDISTRICTS

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 – నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నితిన్ సింగ్ బదౌరి తెలిపారు. రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ నేతృత్వంలో స్థానిక కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ విభాగంలో సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి హ్యాండ్ బుక్, ఐ.డి కార్డులు, ఎలక్షన్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని తన ఫోన్ నెంబరును అభ్యర్థులకు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మే నెల 2 వ తేదీ హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, 5 వ తేదీ వరకు మొత్తం 160 మంది ఓటర్లను వారి గృహల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎం మెషీన్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా చేపడుతామని ఆర్.ఓ తెలిపారు. పోస్టల్ వోటింగ్ ప్రక్రియను కూడా సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *