AMARAVATHIPOLITICS

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు..

అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు బ‌దిలీపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది..పోలింగ్ త‌రువాతే న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఆదేశించింది.. గురువారం సంక్షేమ పథకాలకు  నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.. ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పుడు నిధులు విడుదలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌లు దాఖలు చేసింది..జనవరి నుంచి మార్చి 16 వరకు వివిధ పథకాలకు బటన్ నొక్కి,, అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని ఈసీ ప్రశ్నించింది.. సైలెంట్ పీరియడ్‌లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది..ఈ కారణంగా ఓటర్లపై ప్రభావం వుంటుందని పేర్కొంది.. తాము ఆన్ గోయింగ్ స్కీమ్స్‌కు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు..నాలుగు రోజుల్లో తరువాత ఈనెల 14వ తేదీన విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది చెప్పారు..గతంలో తాము జూన్ 6 వరకు నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని చెప్పినా, ప్రస్తుతం మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని ఈసీ న్యాయవాది పేర్కొన్నారు..ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *