కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ మలుపు తిరుగుతొంది..క్రమశిక్షణకు మారుపేరు అయిన టాటా గ్రూప్ సంస్థలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఒకే సారి 200 మంది కాబిన్ సిబ్బంది మూకుమ్మడి సెలవుల(sick leave)పెట్టింది..దింతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 100 విమాన సర్వీసులను సంస్థ రద్దు చేయాల్సి వచ్చింది..దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ కఠిన చర్యలకు ఉపక్రమించింది..సుమారు 30 మంది సిబ్బందిపై సంస్థ వేటు వేసింది.. ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపు (termination) నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది.. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో సంస్థ పేర్కొంది..షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు..ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రభావం సుమారు 15 వేల మంది ప్రయాణికులపై పడినట్లు సదరు వర్గాలు తెలిపాయి..విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది.