BUSINESS

Jio 5G సేవలు మరిన్ని నగరాల్లో అందుబాటులోకి

అమరావతిం రిలయన్స్ Jio 5G సేవలను బుధవారం మరో 27 నగరాల్లో విస్తరించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 331 నగరాల్లో Jio 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ పేర్కొంది.. కొత్తగా మరికొన్ని నగరాల్లో Jio 5G సేవలు విస్తరించిన నేపథ్యంలో వినియోగదారులను ఈ నేటి నుంచి జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానిస్తున్నామని సంస్థ వెల్లడించింది.. Jio 5G సేవలను 1Gbps స్పీడుతో డేటాను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో Jio 5G సర్వీసులను మరింత విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది.అలాగే ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోపాటు మొత్తం 27 నగరాల్లో Jio 5G సర్వీసులను విస్తరించింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, విజయవాడ, తిరుపతి, తిరుమల, తెనాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రొద్దుటూరు, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, మదనపల్లి, కర్నూలు, కాకినాడ, కడప, హిందూపూర్, గుంటూరు, గుంతకల్, ఏలూరు, చిత్తూరు, చీరాల, భీమవరం, అనంతపురం, మచిలీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం నగరాల్లో Jio 5G సేవలను అందిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది.. హైదరాబాద్‌లో Jio 5G సేవలను విస్తరించామని రిలయన్స్ జియో పేర్కొంది.

Spread the love
venkat seelam

Recent Posts

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 hour ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

2 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

18 hours ago

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…

20 hours ago

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…

21 hours ago

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను వేస్తే కఠిన చర్యలు-M.H.O Dr. వెంకట రమణ

నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడంతో పశువులు, కుక్కలు, పందులకు ఆయా ప్రాంతాలు ఆవాసంగా మారడంతో పాటు దోమల వ్యాప్తికి…

2 days ago

This website uses cookies.