అమరావతి: ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు,,సద్గురు జగ్గీ వాసుదేవ్(66)కు న్యూఢిల్లీ,ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర బ్రెయిన్ సర్జరీ జరిగింది..ఈనెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశామని,, ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి పేర్కొన్నారు.. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.. ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను తెలియ చేస్తూ గత నాలుగు వారాలుగా అయన తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న విషయం తనకు తెలిపారన్నారు..మహాశివరాత్రి సందర్బంగా ఆయన బీజీగా వున్నడన్నారు..మార్చి 15న నొప్పి మరింత తీవ్రమవ్వడంతో తనని సంప్రదించారని అన్నారు.. అప్పుడే ఏదో చెడు జరుగుతోందన్న విషయాన్ని తాను గ్రహించానన్నారు..మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి వేగంగా క్షీణించిందని దాంతో ఆయనకు వాంతులు అయ్యాయని చెప్పారు..అప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా.. CT-స్కాన్ చేశామన్నారు..రిపోర్ట్ లో సద్గురు మెదడులో రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు తేలిందని చెప్పారు..ఆ రిపోర్ట్ ఆధారంగా సద్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న విషయం తేలిందని,, దీంతో కొన్ని గంటల్లోనే ఆయనకు మెదడు శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వినిత్ సూరి వెల్లడించారు.. ఆ సర్జరీని వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని వైద్యుల బృందంలో నిర్వహించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని,, మెదడు, శరీరం, వైటల్ పారామీటర్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు.. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.