AMARAVATHIDEVOTIONAL

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ బ్రెయిన్ సర్జరీ

అమరావతి: ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు,,సద్గురు జగ్గీ వాసుదేవ్‌(66)కు న్యూఢిల్లీ,ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర బ్రెయిన్ సర్జరీ జరిగింది..ఈనెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశామని,, ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి పేర్కొన్నారు.. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.. ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను తెలియ చేస్తూ గత నాలుగు వారాలుగా అయన తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న విషయం తనకు తెలిపారన్నారు..మహాశివరాత్రి సందర్బంగా ఆయన బీజీగా వున్నడన్నారు..మార్చి 15న నొప్పి మరింత తీవ్రమవ్వడంతో తనని సంప్రదించారని అన్నారు.. అప్పుడే ఏదో చెడు జరుగుతోందన్న విషయాన్ని తాను గ్రహించానన్నారు..మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి వేగంగా క్షీణించిందని దాంతో ఆయనకు వాంతులు అయ్యాయని చెప్పారు..అప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా.. CT-స్కాన్ చేశామన్నారు..రిపోర్ట్‌ లో సద్గురు మెదడులో రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు తేలిందని చెప్పారు..ఆ రిపోర్ట్ ఆధారంగా సద్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న విషయం తేలిందని,, దీంతో కొన్ని గంటల్లోనే ఆయనకు మెదడు శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వినిత్ సూరి వెల్లడించారు.. ఆ సర్జరీని వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని వైద్యుల బృందంలో నిర్వహించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని,, మెదడు, శరీరం, వైటల్ పారామీటర్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు.. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *