NATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ను సందర్శించిన 1.62 కోట్ల మంది టూరిస్టులు

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ను ఈ సంవత్సరం ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్‌ టూరిజం శాఖ అధికారి వెల్ల‌డించారు. ఆర్టికల్ 370,35B ని తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరువాత, జ‌మ్మూక‌శ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న్నారు. 30 సంవత్సరాల తరువాత మ‌ళ్లీ అధిక స్థాయిలో ల‌క్ష‌లాది మంది టూరిస్టులు క‌శ్మీర్‌కు వ‌స్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.క‌శ్మీర్ టూరిజంలో మ‌ళ్లీ స్వ‌ర్ణ‌యుగం మొద‌లైందని, జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రాంత ప్రజలకు టూరిజ‌మే అతిపెద్ద ఉపాధి అన్నారు.2022 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది ప‌ర్యాట‌కులు క‌శ్మీర్‌ను సందర్శించారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర భార‌త్‌ చరిత్రలో అత్య‌ధిక స్థాయిలో ప‌ర్యాట‌కులు రావ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్పారు. ఈ ఏడాది తొలి 8 నెల‌ల్లోనే రికార్డు స్థాయిలో 20.5 ల‌క్ష‌ల దేశీయ టూరిస్టులు వ‌చ్చారని,ఇందులో 3.65 ల‌క్ష‌ల మంది అమ‌ర్‌నాథ్ యాత్రికులు ఉన్న‌ట్లు వెల్లడించారు. ప‌హ‌ల్గామ్‌, గుల్మార్గ్‌, సోనామార్గ్ లాంటి టూరిస్టు ప్రాంతాల్లో హోట‌ళ్లు, గెస్ట్‌ హౌజ్‌లు నూటికి నూరు శాతం నిండిపోయాయి అని తెలిపారు. టూరిజం వ‌ల్ల పూంచ్‌, రాజౌరి, జ‌మ్మూ, క‌శ్మీర్ లోయ‌లో భారీ సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు స్థానికులు పొందారన్నారు.చిత్ర నిర్మాణానికి సంబంధించి, స‌మ‌గ్ర‌మైన ఫిల్మ్ పాల‌సీని కూడా రూపొందించమని, ఈ సారి 140 సినిమా షూటింగ్‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

18 hours ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

19 hours ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

23 hours ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

1 day ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

2 days ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

2 days ago

This website uses cookies.