అమరావతి: మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ(78)కి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు స్థానిక మీడియా ఏజెన్సీలు పెర్కొన్నాయి..బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.. ఆంగ్ సాన్ సూకీని 2021లో సైన్యం అదుపులోకి తీసుకున్నది..క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న 5 కేసుల్ని రద్దు చేయగా మరో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా సమాచారం..గత సంవత్సరం కాలంగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవిస్తూండగా గత సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్కు మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది..ప్రస్తుతానికి సూకీని గృహనిర్బంధంలోనే ఉంచనున్నట్లు మయన్మార్ రేడియో వెల్లడించింది..సూకీ తొలిసారి 1989లో అరెస్టు కాగా 1991లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది..2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి కావడంతో 2015 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పార్టీ నెగ్గింది..ఎన్నికైన వెంటనే సూకీ పలు సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో,, సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించిన సైన్యం మళ్లీ తిరుగుబాటు చేసింది..దీంతో ఆమె మళ్లీ 2021లో నిర్బంధంలోకి వెళ్లింది..సూకీతో పాటు బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పించిన్నట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొన్నాయి.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.