AMARAVATHIINTERNATIONAL

మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష

అమరావతి: మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ(78)కి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు స్థానిక మీడియా ఏజెన్సీలు పెర్కొన్నాయి..బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.. ఆంగ్ సాన్ సూకీని 2021లో సైన్యం అదుపులోకి తీసుకున్నది..క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న 5 కేసుల్ని రద్దు చేయగా మరో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా సమాచారం..గత సంవత్సరం కాలంగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవిస్తూండగా గత సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్కు మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది..ప్రస్తుతానికి సూకీని గృహనిర్బంధంలోనే ఉంచనున్నట్లు మయన్మార్ రేడియో వెల్లడించింది..సూకీ తొలిసారి 1989లో అరెస్టు కాగా 1991లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది..2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి కావడంతో 2015 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పార్టీ నెగ్గింది..ఎన్నికైన వెంటనే సూకీ పలు సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో,, సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించిన సైన్యం మళ్లీ తిరుగుబాటు చేసింది..దీంతో ఆమె మళ్లీ 2021లో నిర్బంధంలోకి వెళ్లింది..సూకీతో పాటు బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పించిన్నట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొన్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *