అమరావతి: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 భవిష్యతులో తిరిగి రాదని కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు..కొన్ని పార్టీలు ఆర్టికల్ 370 కశ్మీరీల్లో అపోహలను కల్పిస్తున్నారని, తాను మాత్రం అలాంటి అపోహలకు తావివ్వబోనని ఆయన పేర్కొన్నారు..ఆదివారం ఉత్తర కశ్మీర్ అయిన బారాముల్లాలో బహిరంగ సభ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ “గులాం నబీ ఆజాద్ ఎవరినీ తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. ఓట్ల కోసం ఎవరికీ అబద్ధాలు చెప్పదల్చుకోలేదు.సాధ్యం కాని విషయాలపై చర్చలు, భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని నేను విజ్ణప్తి చేస్తున్నాను. ఆర్టికల్ 370 ఇక ఎప్పటికీ తిరిగి రాదు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. అది కశ్మీర్ నుంచి సాధ్యం కాదు” కుండబద్దలు కొట్టారు..ఆర్టికల్ 370 తీసుకొచ్చే పరిస్థితిలో ఏ పార్టీ లేదని,,కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదన్నారు.. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని,,ఇదే విషయమై రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్గా ఏర్పాటై డిమాండ్ చేస్తున్నాయి..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.