అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో బొమ్మై ప్రభుత్వం, ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,, 3 రోజుల్లో సర్వీసులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓలా, ఉబర్లు 2 k.m కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ 100 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఎక్కువ ప్రయాణికుల నుంచి మీటర్ తో సంబంధం లేకుండా అధిక ధరలు వసూల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వాటిని నిషేధిస్తున్నామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టీహెచ్ఎం కుమార్ వెల్లడించారు. On-Demand Transportation Technology Act 2016 క్రింద సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. కర్ణాటకలో కనీస ఆటో చార్జ్ మొదటి 2 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే క్యాబ్లలో ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మరి ఈ సంస్థలు దిగివస్తాయో లేదొ వేచి చూడాలి.?
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.