AMARAVATHI

భారత్ రైస్ కే.జీ రూ.29కి విక్రయిస్తాం-కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా

అమరావతి: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది..వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కెట్ లో విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.. ప్రతి శుక్రవారం బియ్యం నిల్వకు సంబంధించిన సమాచారం అందించాలని ఇప్పటికే వ్యాపారులకు సూచించారు.. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని,,Bhart Rice ఇ కామర్స్ ప్లాట్ ఫారమ్ లలో కూడా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.. భారత్ రైస్ ప్రస్తుతం 5, 10 కిలోల ప్యాకెట్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.. దేశంలో పండించే వివిధ రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ,, గత సంవత్సరంతో పోలిస్తే బియ్యం, రిటైల్ హోల్ సేల్ ధరలు దాదాపు 13.8% and 15.7% శాతం పెరిగాయి..ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను రంగంలోకి దించింది..ఇందులో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Nafed),, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF)తో పాటు సెంట్రల్ స్టోర్ట్స్ ద్వారా రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో మొదటి దశ క్రింద 5 లక్షల టన్నుల ‘భారత్ రైస్’ని విక్రయిస్తుంది.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘భారత్ అట్ట’ కిలో రూ.27.50కి, ‘భారత్ దాల్’ (గ్రామ్) కిలో రూ.60కి విక్రయిస్తోందన్న చోప్రా,, ప్రస్తుతం బియ్యం ఎగుమతులపై వున్న ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

42 mins ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

4 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

4 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

24 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

24 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.