భారత్ రైస్ కే.జీ రూ.29కి విక్రయిస్తాం-కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా
అమరావతి: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది..వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కెట్ లో విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.. ప్రతి శుక్రవారం బియ్యం నిల్వకు సంబంధించిన సమాచారం అందించాలని ఇప్పటికే వ్యాపారులకు సూచించారు.. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని,,Bhart Rice ఇ కామర్స్ ప్లాట్ ఫారమ్ లలో కూడా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.. భారత్ రైస్ ప్రస్తుతం 5, 10 కిలోల ప్యాకెట్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.. దేశంలో పండించే వివిధ రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ,, గత సంవత్సరంతో పోలిస్తే బియ్యం, రిటైల్ హోల్ సేల్ ధరలు దాదాపు 13.8% and 15.7% శాతం పెరిగాయి..ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను రంగంలోకి దించింది..ఇందులో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Nafed),, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF)తో పాటు సెంట్రల్ స్టోర్ట్స్ ద్వారా రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో మొదటి దశ క్రింద 5 లక్షల టన్నుల ‘భారత్ రైస్’ని విక్రయిస్తుంది.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘భారత్ అట్ట’ కిలో రూ.27.50కి, ‘భారత్ దాల్’ (గ్రామ్) కిలో రూ.60కి విక్రయిస్తోందన్న చోప్రా,, ప్రస్తుతం బియ్యం ఎగుమతులపై వున్న ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.