AMARAVATHI

టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుంది! – జనసేనాని

అమరావతి: టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందని తాను భావిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు..శుక్రవారం మంగళగిరి కార్యాలయంలో అయన మాట్లాడుతూ తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటాం ? ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం ? అనేది వైసీపీకి ఎందుకని నిలదీశారు..2014లో టీడీపీ,,జనసేన,,బీజెపీ కలసి పోటీ చేసిందని,అదే కూటమి మళ్లీ 2024లో కలిసి ఎన్నికలకు వెళ్లాలని తను బలంగా కోరుకుంటున్నాను అని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, కూటములు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఒక వైపు చర్చలు జరుగుతుండగా,, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు..
టీడీపీతో పొత్తు విషయమై తాను ఢిల్లీకి వెళ్లి ప్రకటించాలి అనుకున్నానని అయితే వైసీపీ నాయకులు ప్రవర్తించిన విధానం వల్లే రాజమండ్రిలో పోత్తూలపై ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు..ఆదే సమయంలో G-20 సమావేశాల వల్ల బీజేపీ అగ్రనేతలు అందుబాటులో లేరని తెలిపారు..జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ ఇప్పటికే ఉందని,, టీడీపీతో పొత్తూ విషయం ప్రకటించడంతో,ఇప్పుడు టీడీపీ-జనసేన కో-ఆర్డినేషన్ కమిటీని నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు..తెలంగాణలో టీడీపీతో పొత్తు గురించి చర్చలు జరగాలన్నారు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కో-ఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. తెలంగాణకు పసుపు బోర్డు వచ్చిందని,, జగన్ డిల్లీకి వెళ్లి కోకోనట్ (కొబ్బరి) బోర్డు తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు..జగన్ డిల్లీకి వెళ్లేది తన కేసుల గురించి కానీ రాష్ట్రం గురించి కాదంటూ దెప్పిపొడిచారు..కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం లాబియింగ్ రాష్ట్రం కోసం చేస్తుందా? లేక జగన్ వ్యక్తిగత విషయాల కోసం కేంద్రంతో, వైసీపీ ప్రభుత్వం లాబియింగ్ చేస్తోందా అంటూ ప్రశ్నించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 hour ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 hour ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

21 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

21 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

This website uses cookies.