CRIME

గుజరాత్ లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి-40 మంది మృతి

అమరావతి: గుజరాత్, మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలడంతో, దాదాపు 40 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియ వెల్లడించారు.ఇక ఈ ప్రమాద ఘటనలో దాదాపు 100 మంది జాడ గల్లంతు అయ్యి వుండవచ్చని భావిస్తున్నారు? 100 మంది సందర్శకులు సరదాగా కేబుల్ బ్రిడ్జిపై తిరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలింది. బ్రిడ్జిపై ఉన్న సందర్శకులు తేరుకునేలోపే చాలామంది నదిలో పడిపోయారు. కేబుల్ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న వారు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ కేబుల్ బ్రిడ్జికి మరమ్మత్తులు రావడంతో కొన్ని రోజులపాటు మూసి వేశారు. ఇటీవలనే అధికారులు మరమ్మతులు పూర్తి చేసి, సందర్శకులు తిరిగేందుకు ఐదు రోజుల క్రితమే అనుమతిచ్చారు. కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటనే స్పందించి, తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. 

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

4 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

5 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

7 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

7 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

8 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.