అమరావతి: పిల్లల ఆధార్ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ ఛార్జీల వసూళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది.ఆధార్ అప్డేట్ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ఆధార్ సంస్థ(UIDAI) ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ఉచిత సర్వీసు కేవలం “బాల్ఆధార్లో అప్డేట్ ” చేసుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా బాల్ఆధార్ అప్డేట్ కోసం డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని సూచించింది. వినియోగదారులు 1947 నెంబర్కు ఫిర్యాదు చేయాలని, లేదా help@uidai.gov.in ఈమెయిల్కు ఫిర్యాదు చేయాలని సూచించింది. యూఐడీఏఐ బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి ఇటీవల కొత్త సూచనలు జారీ చేసింది.5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు,, ఆధార్ రికార్డులలో బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది.5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ ట్విట్టర్లో ప్రకటించింది. బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్లు మారవని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్ కార్డ్ను అప్లై చేయడానికి, పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.