HYDERABAD

ధర్మం కోసం మాట్లాడుతున్నందుకు నన్ను లేకుండా చేస్తారు-ఎమ్మేల్యే రాజాసింగ్

జెండాను ఎగురవేసి..సెల్యూట్ చేయాలి..

హైదరాబాద్: ధర్మం కోసం మాట్లాడుతున్నందుకు తనను వందకు వంద శాతం లేకుండా(ఎమ్మేల్యేగా) చేస్తారని,,ఈ విషయం తనకు కూడా తెలుసని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని,,ఇందులో బాగంగా హిందువులపై వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నరన్నారు..ధర్మం గురించి మాట్లాడే తనలాంటి వారు కొంతమంది ఉండొచ్చని, దీనిపై మాట్లాడుతున్నందుకు ఇవ్వాళ కాకపోతే రేపు తనపై …ఉపయోగిస్తారని రాజాసింగ్ చెప్పారు..వందకు వంద శాతం తనను తుదముట్టిస్తారని, ఇది పక్కా అని, డేట్ కూడా రాసి పెట్టుకోండని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న తరుణంలో భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్బంగా అందరి ఇళ్లపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలనే పిలుపులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు..ఈ సందర్భంలో అయన పై విధంగా వ్యాఖ్యనించారు.. అలాగే  ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు రాజాసింగ్ సవాల్ విసిరారు.. మీరు నిజమైన దేశ భక్తులు అయితే జాతీయ జెండాను ఎగురవేసి..సెల్యూట్ చేయాలన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

10 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

11 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

13 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

13 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

14 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.