NATIONAL

విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలి-ప్రధాని మోదీ

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సు..

అమరావతి: విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలని,,ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌ తుకాదోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సును వర్చువల్ ప్రారంభించారు..అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు..అంతర్జాతీయ మిల్లెట్స్ (తృణ ధాన్యాల) సంవత్సరంగా ప్రకటించిందని, భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్పిని సైన్స్ వినియోగంతో మరింత మెరుగుపరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు..సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం,, సైన్స్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు..21వ శతాబ్దంలో భారతదేశంలో మనకు రెండు విషయాలు కనిపించాయని,,డేటా, టెక్నాలజీ అని వివరించారు..ఇవి భారతదేశ విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవన్నారు..డేటా విశ్లేషణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు..సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలవడం గర్వకారణమని తెలిపారు..ప్రస్తుతం స్టార్టప్‌లలో భారతదేశం ప్రపంచంలోని మొదటి 3 దేశాలలో ఒకటిగా ఉందని ప్రధాని మోడీ వివరించారు..2015 వరకు 130 దేశాల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ లో 81వ స్థానంలో ఉన్నామని,,అయితే 2022 నాటికి 40వ స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

36 mins ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

1 hour ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

1 hour ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 day ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

1 day ago

This website uses cookies.