నెల్లూరు: తమ డిమాండ్లను తీర్చాలంటూ నెల్లూరు లోని ICDS కార్యాలయంలో సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురువారం సంఘీభావం తెలిపారు..ఈ సందర్భంలో జానీమాస్టర్ మాట్లాడుతూ నెల్లూరులో సమ్మె చేస్తున్న అంగనవాడి కార్యకర్తలకు మద్దతు తెలుపడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు..తాను ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చానని,,సినిమాల్లో అవకాశాలు కోసం ఎదురుచూస్తూ ఒక అవకాశం వస్తే కడుపునిండా తినవచ్చని ఎదురు చూసేవాడిని గుర్తు చేసుకున్నారు..ప్రస్తుతం అంగన్వాడీ ఉద్యోగస్తుల పరిస్థితి కూడా అలాగే ఉందని,, అంగన్వాడీలుకు గత మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని తెలిసిందన్నారు..నెల తర్వాత జీతం వస్తేనే ఇల్లు గడిచే పరిస్థితిలో అంగన్వాడీలు ఉన్నారని కాబట్టి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను సీ.ఎం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.