అమరావతి: సుప్రీంకోర్టు జరిగే కేసు విచారణను మొదటిసారి యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు.మంగళవారం ఒకే రోజు మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారిస్తున్న EWS కేసుతోపాటు, జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను, జస్టిస్ ఎస్కే కాల్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ చేసింది.త్వరలోనే సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రత్యేక మీడియా ద్వారా కేసు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణలను మాత్రమే ప్రసారం చేస్తారు. తరువాత మిగతా ధర్మాసనాలు జరిపే విచారణలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన నిర్ణయం 2018లోనే తీసుకున్నప్పటికి, ఆచరణలోకి రాలేదు.గత నెలలో రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ,తన పదవీ విరమణ రోజున లైవ్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దేశంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటిసారి.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.