నెల్లూరు: చుక్కల భూముల సమస్యలపై ఈనెల 20వ తేదీ శనివారం నాడు నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన నెల్లూరు రెవెన్యూ డివిజన్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వ తేదీ శనివారం నాడు జరిగే చుక్కల భూముల సమస్యలపై రెవిన్యూ సదస్సు గురించి ప్రజలందరికీ తెలిసేలా గ్రామాలలో టామ్ టామ్ వేయాలన్నారు. ఈ సదస్సు నెల్లూరు డివిజన్లోని ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10:30గంటలకు జరుగుతుందన్నారు.ఈ సదస్సులో చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. చుక్కల భూములకు సంబంధించి నిబంధనల మేరకు అనుగుణంగా ఉన్నటువంటి దరఖాస్తులను స్వీకరించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.