TECHNOLOGY

అన్ని ఫోన్ల ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా ప్రయత్నాలు-రోహిత్ కుమార్ సింగ్

అమరావతి: మొబైల్ కంపెనీలు గతంలో లాగా ఫోన్ కొంటే,చార్జ్ ఫ్రీగా ఇచ్చే రోజులు పోయాయి..ఐ ఫోన్,ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారు తప్పని సరిగా రెండు రకాల చార్జర్స్  కొనాల్సిందే..అన్ని ఫోన్లు,ట్యాబ్ లకు ఒకే రకమైన చార్జర్ విధానాని అమెరికా,,ఐరోపా దేశాలు తప్పని సరి చేశాయి..దింతో సంబంధిత కంపెనీలు తమ మానుఫ్యాకర్చ్ విధానంలో మార్పులు చేసుకుంటున్నాయి..ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకటే ఛార్జర్​తో పనిచేసే విధానం దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది..ఇందులో బాగంగా బుధవారం ఒక్కో డివైజ్​కు ఒక్కో రకం ఛార్జర్​ కాకుండా, అన్నింటికీ సింగిల్ ఛార్జర్ తీసుకొచ్చే అంశంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి మొబైల్స్, ల్యాప్​టాప్​ తయారీదారులు; సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు,, దిల్లీ ఐఐటీ,, వారణాసి ఐఐటీ నిపుణులు హాజరయ్యారు..డివైజ్​ను బట్టి ఛార్జర్లు మారే విధానం వల్ల ఈ-వ్యర్థాలు పెరిగి పర్యావరణంపై ప్రభావం పడుతోందని తయారీదారులు సైతం అంగీకరించారని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు..ఇదే సమయంలో ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డట్లు వెల్లడించారు..అన్నింటికీ ఒకటే ఛార్జర్ కాకపోయినా,, తొలి దశలో రెండు రకాల ఛార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని,, ఇందులో సీ-టైప్ ఛార్జర్ కూడా ఒకటని సమావేశం అనంతరం రోహిత్ పేర్కొన్నారు..ఇది చాలా సంక్లిష్టమైన విషయమని,,మనం నిర్ణయం తీసుకునే ముందు అందరి(తయారీదారులు, యూజర్లు, పర్యావరణం) వాదనల్నీ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.. భాగస్వామ్యపక్షాల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది,,అయితే వాటన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తాం,, మొబైల్, ఫీచర్​ ఫోన్స్​; ల్యాప్​టాప్స్​, ఐప్యాడ్స్​,, వేరబుల్స్,, ఎలక్ట్రానిక్ డివైజెస్​,, ఇలా మూడు విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు..ఆయా బృందాలను ఈ నెలలోనే నోటిఫై చేస్తామని,,రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలు అందజేస్తాయని మీడియికు వివరించారు..

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

2 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

3 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

4 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

4 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 day ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

This website uses cookies.