AMARAVATHI

రూ.24,470 కోట్లు ఖర్చుతో 508 రైల్వేస్టేషన్ల అభివృద్దికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

అమరావతి: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు..ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు..కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.24,470 కోట్లు ఖర్చు చేయనుంది..వాస్తవానికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాల్సి ఉండగా అందులో 508 స్టేషన్లలకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు.. రైల్వే చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఇదే తొలిటిసారి..
సంబంధిత నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను ‘సిటీ సెంటర్స్’గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు..ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి..వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో చెరో 55, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.. స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు..ఈ రైల్వే స్టేషన్ సదరు నగర అందాలను ప్రతిబింబిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

20 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

22 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

22 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

23 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

2 days ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

2 days ago

This website uses cookies.