AMARAVATHINATIONAL

రూ.24,470 కోట్లు ఖర్చుతో 508 రైల్వేస్టేషన్ల అభివృద్దికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

అమరావతి: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు..ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు..కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.24,470 కోట్లు ఖర్చు చేయనుంది..వాస్తవానికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాల్సి ఉండగా అందులో 508 స్టేషన్లలకు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు.. రైల్వే చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఇదే తొలిటిసారి..
సంబంధిత నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను ‘సిటీ సెంటర్స్’గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు..ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి..వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో చెరో 55, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.. స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు..ఈ రైల్వే స్టేషన్ సదరు నగర అందాలను ప్రతిబింబిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *