NATIONAL

ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు PFI కుట్ర

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో బయటపడింది.PFI  కార్యాలయాలు,సంస్థ నేతల ఇళ్లపై ఇటీవల NIA,ED చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ సంవత్సరం జులై 12వ తేదిన ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా PFI సభ్యులు దాడికి విఫలయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు PFI పలువురు యువకులకు శిక్షణ కూడా ఇచ్చారని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలువురు ప్రముఖులపై దాడికి PFI  మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. NIA, ED లు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, PFIలో క్రీయాశీలకంగా వున్న దాదాపు 100 మంది నేతలను అరెస్ట్ చేసింది.ఈ ఏడాది జులై 12వ తేదీన పాట్నాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా PFI నేత షఫీక్ పైత్, మోదీ హత్యకు పథకం రూపొందించారని తెలిసింది. ED జరిపిన సోదాల్లో గత కొన్నేళ్లుగా PFIకు సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.120 కోట్లకు పైగా నగదు జమ అయినట్లు బయటపడింది.ప్రజల్లో మతవిధ్వేషలు రెచ్చకొట్టి, మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో PFI సభ్యులు హత్రాస్‌కు వెళ్లారని దర్యాప్తులో వెల్లడైంది. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్రవాద ముఠా ఏర్పాటుకు ప్లాన్ చేయడం, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ, సున్నితమైన ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేయడంలో PFI తన కార్యకర్తలతో కలసి పాలుపంచుకున్నట్లు ఆధారాలు కూడా కేంద్ర దర్యప్తు సంస్థలకు అందాయి. మతవిధ్వేషలు రెచ్చకొడుతున్న PFI సంస్థను నిషేధించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తొంది.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

8 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

16 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.